(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం*తెలంగాణలో ప్రతి ఇల్లు గణన*
* భారత జనగణన-2027లో భాగంగా తెలంగాణలో చేపట్టనున్న ఇళ్ల గణనపై జనగణన రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోళికెరి మాట్లాడారు. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లును నమోదు చేస్తామని తెలిపారు. ఆసుపత్రి, బడి, గుడి, గుడిసె, అద్దె భవనం ఏదైనా గణన చేస్తామన్నారు. భవనంలోని ప్రతి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు.