(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 29 హరీష్ రావు
మహాధర్నా వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు* గారు
తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను సిద్దిపేట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు* గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు* గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ పనుల్లో వారికి సముచిత అవకాశాలు ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాధర్నా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ *తూడి సుజయ్ కుమార్*
కామ శ్రీనివాస్ , లక్ష్మణ్ లింగం, స్వామి,అజయ్ ,పరశురాముడు, మహేష్ తదిరులు పాల్గొన్నారు.