Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 10:27 am Editor : Admin

మల్లికార్జున్ కార్గే ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే 30

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్*

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది అధిష్టానం. కార్యకర్తలను మరింత చేరువ చేసేందుకు *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్* తో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నియోజక వర్గం సీనియర్ నాయకులు *అనిల్ కుమార్ యాదవ్* ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ శాసనసభాపతి *గడ్డం ప్రసాద్ కుమార్* తో కలిసి నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత *రాహుల్ గాంధీ* ను కలిసిన అనంతరం నేడు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు *మల్లికార్జున ఖర్గే* తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గం లో పార్టీ పని చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్న ట్లు సమాచారం. ఈ మేరకు అనిల్ కుమార్ యాదవ్ కి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాహుల్,ఖర్గే ని కలవడం తన పై పార్టీ బలోపేతం అంశంపై భాద్యతను పెంచినట్లు అనిల్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో వెల్లడించారు.