(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొండాపూర్ జూన్ 6
చండ్ర రాజేశ్వర రావు గారి 112వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో చండ్ర రాజేశ్వరరావు (సిఆర్) విగ్రహానికి చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. నారాయణ, సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ శ్రీమతి సృజన, IAS పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నారాయణ ప్రసంగిస్తూ –
కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో, భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలోనూ, తెలంగాణ సాయిధ పోరాటం లోను, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలించడంలో చండ్ర రాజేశ్వర్ రావు నిర్వహించిన పాత్ర ప్రముఖమైనదని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద రక్షణకు మరియు దేశ సమైక్యతకు కృషిచేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని తెలిపారు.
మూడు దశాబ్దాల పైగా ప్రారంభించబడిన సి ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు-
హైదరాబాదులో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించి 150 మంది సీనియర్ సిటిజనులకు ఆశ్రమం కల్పించామని;
సి ఆర్ ఫౌండేషన్ తరపున ఒక మహిళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు సిఆర్ పాలి క్లినిక్ , ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం, కార్యకలాపాలు విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే గుంటూరులో నాలుగు ఎకరాల్లో, గూడూరు లో ఒక ఎకరం విస్తీర్ణంలో సి ఆర్ ఫౌండేషన్ పేరుతో ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫన్స్ చిల్డ్రన్ హోం లు నిర్మించబోతున్నట్లు తెలిపారు.
కడపలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హోమ్ నీ వచ్చే నెల నుంచి ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు.
సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ శ్రీమతి సృజన, IAS
మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు గారు దేశం మొత్తం గర్వపడే విధంగా కృషి చేశారని, ఆయన ప్రజల కొరకు ఎన్నో త్యాగాలను చేశారని, ఆయన పేరిట వున్న చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ చేస్తున్న సామాజిక సేవలను ప్రశంసించారు. సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజి సేవా సంస్థలన్నింటినీ ఆమె సందర్శించారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రజిని,
మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోశ్యభట్ల కల్పన , వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తాన్య, యన్. రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వర రావు, సాంబశివ రావు, అరుణకుమారి మహిళాసంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత, ఆరుట్ల మమత, డి. కృష్ణకుమారి, వంక లక్ష్మి, పాలిక్లినిక్ సి ఓ ఓ శ్రీమతి విజయ, సీఈఓ డి. శ్రీనివాస్, సి పి ఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ, శేరిలింగంపల్లి కార్యదర్శి చందు యాదవ్, ఎన్ ఆర్ ఆర్ సెంటర్ సభ్యులు డి. జవహర్ బాబు
వృద్ధాశ్రమ వాసులు, విద్యార్దినిలు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.