(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జూన్ 7
ఏసీబీ అధికారుల వలలో అవినీతి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
నల్లగొండ కలెక్టర్ కార్యాలయం లో ఉన్న సదరు వక్ఫ్ కార్యాలయం లో సోదాలు నిర్వహిస్తున్న #ACB అధికారులు..
పెద్దవురా లోని మసీదు కి గల సుమారు 996.33 గజల భూమి గతంలో కొందరు దాతలు ఇచ్చారు అని సమాచారం…
భూమి రేట్లు అమాంతం పెరుగుదల కావడం తో కన్నేసిన దాతల వారసులు..
భూమి వక్ఫ్ కి చెందాలి లేదా మసీదు కి చెందాలి అని అన్యాక్రాంతం కావొద్దు అని మసీదు నిర్వాహకుడు వక్ఫ్ బోర్డు కి లేఖ రాసినట్లు సమాచారం..
అయితే వక్ఫ్ బోర్డు వారు సదరు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మెహమూద్ కి విచారణ చేయమని తెలుపుగా..
మసీదు నిర్వాహకుడు రిపోర్టు కరెక్టు ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని ఇన్స్పెక్టర్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు…
ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు..
విస్తృత తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు..మరి కొద్ది నిమిషాల్లో వివరాలు వెల్లడించనున్న ఏసీబీ డిఎస్పీ.జగదీష్.