(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొండాపూర్ జూన్ 13
చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్
శ్రీకృష్ణ లీలలు నాటక ప్రదర్శన
సురభి డ్రామా థియేటర్ వారి ఆధ్వర్యంలో
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ సి ఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్, ఇంద్రజిత్ గుప్తా హాలు లో శనివారం13 జూన్ నాటక ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ గారు ప్రదర్శనను చూసి కళాకారులను అభినందించారు.
అనంతరం నారాయణ గారు మాట్లాడుతూ
140 సంవత్సరాల ఘన నాటక రంగ చరిత్ర కలిగిన “సురభి” కళామతల్లిని ప్రోత్సహించాలి – హీన సంస్కృతిని కాదు
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని తరతరాలకు అందిస్తూ 140 సంవత్సరాలుగా ప్రజలను అలరిస్తున్న “సురభి” నాటకరంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి. సురభి వంటి కళాసంస్థలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాకుండా సమాజానికి విలువలు, చైతన్యం, సృజనాత్మకతను అందించే కళా నిలయాలు.
నేడు వినోదం పేరుతో హీన సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు లభిస్తున్న ప్రాధాన్యత కంటే, కళా విలువలను పరిరక్షిస్తూ ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే సురభి వంటి నాటక సమాజాలకు ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.
విలాసవంతమైన, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడం కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్న సంప్రదాయ నాటకరంగం, జానపద కళలు, రంగస్థల కళాకారులను ఆదుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
నిజమైన కళను, సంస్కృతిని పరిరక్షించడం సమాజం మరియు ప్రభుత్వాల బాధ్యత. తెలుగు కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన “సురభి” నాటకరంగాన్ని రక్షించి, ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు మన సాంస్కృతిక సంపదను అందించగలుగుతాము.
ఈ నాటక ప్రదర్శన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ , సి ఆర్ పాలిక్ క్లినిక్ డైరెక్టర్ కె రజిని, ఏఐటీయూసీ సీనియర్ నాయకురాలు ప్రేమ పావని, కనపర్తి జోత్స్న, వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు ఎన్ రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వరరావు ,ఐదు కళ్ళు అరుణకుమారి, తమ్మారెడ్డి తానియా,వృద్ధాశ్రమ వాసులు, హోం మేనేజర్ శ్రీనివాస్, సురభి డ్రామా థియేటర్ అధ్యక్షులు వాసుదేవరావు, ప్రజానాట్యమండలి కళాకారులు కూన సుధాకర్, డప్పు రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
నాటక ప్రదర్శన చేసిన కళాకారులను వృద్ధాశ్రమ వాసులు అభినందించరు