గుడిసెల కూల్చివేత నిలిపివేయాలి టి రామకృష్ణ
నేటి సత్యం గుండ్ల సింగారం జూన్ 20 గుండ్ల సింగారంలో పేదల గుడిసెల కూల్చివేత వెంటనే నిలిపివేయాలి టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గుండ్ల సింగారంలో గత ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న పేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం అత్యంత అమానుషమైన చర్య. నివాస హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అలాంటి హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న...