(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం రంగారెడ్డి జూలై 18
బహదూర్గూడకు వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అరెస్ట్
గ్రామస్థులను నిర్బంధించి బయటి వారిని అడ్డుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్థులను నిర్బంధించి, బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
రైతులకు మద్దతు తెలిపేందుకు బహదూర్గూడకు వెళ్లిన రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా శంషాబాద్ 118 డివిజన్ అధ్యక్షుడు కొల్లాన్ ప్రదీప్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మండపతి పరమేశ్వరి, రాహుల్ తదితరులు ఆయనతో కలిసి వెళ్లారు