Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 3:57 pm Editor : Admin

మొక్కలు నాటిన కేటీఆర్…!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 24

పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు.

తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.

అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్‌తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.