హక్కుల సాధనకై గర్జించిన కార్మికులు
విజయవంతంగా ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా 3వ మహాసభలు. తాడూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ, కార్మికుల గర్జన. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభలు ఆదివారం తాడూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికులు ఎర్రజెండాలతో, నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాడూర్ ప్రధాన రహదారుల గుండా సాగిన ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. "లేబర్ కోడ్స్ రద్దు చేయాలి", "కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి",...