(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- రాజారాం దుబ్బా లో కార్డన్ సెర్చ్ 18 బైకులు ఒక ఆటో సీజ్
కామారెడ్డిజూలై 29(నేటి సత్యం ప్రతినిధి) బాన్సువాడ మండల కేంద్రంలోని రాజారాం దుబ్బ లొ బుధ వారం 150 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు అధికారులు.అనుమానితుల ఇంటింటికి వెళ్లి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు.112 మోటార్ సైకిల్ లను 18 ఆటో లను తనిఖీ చేశారు. వారి ధ్రువపత్రాలు చూసి వాహనాలు అప్ప చెప్తామని డిఎస్పి విఠల్ రెడ్డి తెలిపారు. వీటిలో 18 బైకులు ఒక ఆటో ను సీజ్ చేసినట్లు డి.ఎస్.పి తెలిపారుమాదకద్రవ్యాల తో జరిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించారు .అనుమానాస్పదంగా తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డిఎస్పి తో పాటు సిఐ లు తుల శ్రీధర్,తిరుపయ్య,రవి కుమార్ లు ఉన్నారు.