(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం రంగారెడ్డి జూలై 30
ఉద్యమాల నేత కోర్టుకు హాజరు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లో 2016 సంవత్సరంలో మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉద్యమాలు చేసిన సందర్భంగా మున్సిపల్ అధికారులు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అప్పటినుండి ఈరోజు రాజేంద్రనగర్ కోర్టుకు వనంపల్లి జైపాల్ రెడ్డి, టి ఆనంద్, ఎర్ర వెంకటేష్, గార్లు కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి కోర్టు కేసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా మున్సిపల్ కార్మికుల శ్రేయస్ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నాయకత్వం, కొన్ని కార్మిక సంఘాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏలాంటి కేసులు ఉన్నా భయపడకుండా ముందుకు వెళుతున్నాం అంటే అది నాయకుడు నాయకత్వం కార్యకర్తలకు ఇచ్చే ధైర్యం అనీ గుర్తించుకోవాలి.