Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 2:31 pm Editor : Admin

పాఠశాలను ఆకస్మిక తనిఖీ..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బొప్పేల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ.

తెలకపల్లి ఆగస్టు 1 నేటి సత్యం.

మండల పరిధిలోని బొప్పెల్లి ప్రా ప్రాథమికోన్నత పాఠశాలను మండల విద్యాశాఖాధికారి

విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్ తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరు ,ఏడు తరగతులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు 72 మంది విద్యార్థులకు గాను 48 మంది ఉపస్థితి అయినారని విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. మధ్యాహ్న భోజనం ,ఎఫ్ఆర్ఎస్ ఎల్ఐపి ఎఫ్ ఎల్ ఎన్ రికార్డులను పరిశీలించి అన్ని రికార్డులు నవీకరించవలసినదిగా ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నిర్వహించాలని సూచించారు ,తర్వాత గ్రామ పెద్దలు మల్లాచారి .ఉప సర్పంచ్ రాజు ఇతర గ్రామస్తులతో పాఠశాల సౌకర్యాలపై చర్చించారు. అసంపూర్తిగా ఉన్న త్రాగునీటి పనులను పూర్తిచేయాలని విద్యార్థుల టాయిలెట్స్ మైనర్ రిపేర్లు చేయించాలని గ్రామ పెద్దలను కోరడం జరిగింది. అనుమతి లేకుండా అనుపస్థితి అయిన సోషల్ ఉపాధ్యాయులు శ్రీ సిఫాతుర్ రెహమాన్ కు ఒక రోజు వేతనాన్ని నిలిపివేయవలసిందిగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది.