అధ్యాపకుల నియామకంలో జాప్యం..?
నేటి సత్యం/ బాన్సువాడ/ ఆగస్టు 22 అధ్యాపకుల నియామకంలో జాప్యంపై విద్యార్థుల నిరసన బాన్స్ వాడ పట్టణంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తమ విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. ముఖ్యంగా జువాలజీ, సివిక్స్ తదితర సబ్జెక్టుల బోధన సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతుల్లో పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, విద్యార్థులకు సందేహ నివృత్తి చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని...