Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 8:59 am Editor : Admin

నేపాల్ వరద బాధితులను ఆదుకోవాలి..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం/ శేర్లింగంపల్లి/ ఆగస్టు 27

నేపాల్ వరద బాధితులను ఆదుకోవాలి

నేపాల్‌లో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పునరావాసం వంటి అత్యవసర సహాయాన్ని వెంటనే అందించాలి.

ప్రకృతి విపత్తుతో నిరాశ్రయులైన కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని, భారత ప్రభుత్వం కూడా నేపాల్‌కు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు.

వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. బాధిత ప్రజలకు సిపిఐ శ్రేణులు సంఘీభావం ప్రకటిస్తున్నాయని తెలిపారు.

— టి. రామకృష్ణ
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు