Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:42 am Editor : Admin

భారతమ్మ పార్థివ దేహానికి స్వామి గౌడ్ నివాళి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొండపల్లి భారతమ్మ పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ నివాళులు

నేటి సత్యం ఆగస్టు 30 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య

కేసముద్రం మున్సిపాలిటీ ఒకటో వార్డు లక్ష్మీ నగర్ కాలనీలో గుండెపోటుతో మృతి చెందిన కొండపల్లి భారతమ్మ పార్థివదేహానికి ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా ఆయన భారతమ్మ కుమారులు కొండపల్లి వేణుగోపాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన తీవ్ర సానుభూతిని తెలియజేశారు.

​అనంతరం సమ్మిగౌడ్ మాట్లాడుతూ… భారతమ్మ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఆ మహనీయురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కాలనీవాసులు, బంధుమిత్రులు పాల్గొని నివాళులర్పించారు.