గన్నేరువరం మండలంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 21 (రమేష్ రిపోర్టర్):-
ఈరోజు గన్నేరువరం మండలంలో, ఎన్ ఎం ఈ ఓ ( నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, సీడ్స్)
పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100% సబ్సిడీ ద్వారా పొద్దుతిరుగుడు, వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.
మండలానికి 124 కేజీల విత్తనం వచ్చింది. ఒక్కో బ్యాగు పరిమాణం 2 కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవడానికి సరిపోతుంది.
పొద్దుతిరుగుడు పండించే రైతులు పారువెల్ల,గన్నేరువరం గ్రామాల నుండి రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్లారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,ఏఈఓ ప్రశాంత్, అనూష, సాయికుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.