పారువెల్ల గ్రామంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.. 
గన్నేరువరం, నేటి సత్యం న్యూస్: జూన్ 13 (ముడికే రమేష్ యాదవ్ )
గన్నవరం మండలం పారువెల్ల గ్రామ పాఠశాలలో ఉదయం 10 గంటలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ కే రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని, అలాగే క్రమశిక్ష ను పెంపొందించాలని, చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి విజయపాల్ రెడ్డి, ఏ ఏ పీ సి చైర్మన్ వి కవిత, ఉపాధ్యాయులు ఈ భాగ్యలక్ష్మి, ఎండి ఇప్తకర్ అలీ జి కిషన్ రెడ్డి, జి శ్రీనివాస్ కుమార్ గౌడ్, ఎం ఆర్ సి స్ట్రాంగ్ టీచర్స్ శ్రీధర్, జి మహేష్ మరియు అంగన్వాడి టీచర్ ప్రేమలత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.