Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedచలో.సిపిఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేద్దాం

చలో.సిపిఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేద్దాం

నేటి సత్యం నాగర్ కర్నూల్. ఆగస్టు 15

ఈనెల 20న చలో మేడ్చల్ సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 20 నుండి 22 వ తారీకు వరకు మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నిర్వహించబడుతున్నాయి ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన మహాసభల వాల్పోస్టర్లు సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రజలు తీవ్రమైన అసమానతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఈ మహాసభలు ఎంతో ప్రాధాన్యత సంతరించు కున్నాయన్నారు రాబోయే మూడు సంవత్సరాలలో పార్టీ అమలు చేస్తున్న అనేక నిర్ణయాలు ఈ మహాసభలో చర్చిస్తారని వారు తెలిపారు ఈ మహాసభలకు వందలాదిగా ప్రతినిధులు తరలివస్తారని మహాసభ విజయవంతం కై పార్టీ ప్రతి కార్యకర్త ప్రజా సంఘాల నాయకులు శ్రేయోభిలాషులు పూర్తిస్థాయిలో సహకరించాలని వారు పిలుపునిచ్చారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనoనేని సాంబశివరావు గారు మరియు జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి గారు పాల్గొనడం జరుగుతుంది కావున ఈ మహాసభలను విజయవంతం చేయగలరని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొల్లాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల శివుడు గారు పట్టణ కార్యదర్శి ఎం డి యూసుఫ్ మలచింతలపల్లి శాఖ కార్యదర్శి జంగం శివుడు గారు రాము ఇటికల కురుమయ్య శేఖర్ మరియు దాము తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments