నేటి సత్యం ఆగస్టు 10

*ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం*………………….
*రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా… ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి*…………….
*గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*……………
*79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు పలుచోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు*
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం లో గల కమ్యూనిటీ హాల్ ,మండల ప్రాథమిక పాఠశాలలో, గోపనపల్లి తండా ఆటో స్టాండ్, ఎన్టీఆర్ నగర్,గౌలిదొడ్డి వార్డ్ కార్యాలయం, మంజీర డైమండ్ హైట్స్, కేశవ నగర్ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,నానక్ రామ్ గుడా బీజేపీ కార్యాలయం,శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, భరతమాత గారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం.అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో, ఆ కలలను మనమందరం సాకారం చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత అని మీకు గుర్తుకు చేస్తునను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు,కాలనీ వాసులకు, విద్యార్థిని,విద్యార్థులు,స్థానిక నేతలు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.