*భోగి మంటలు… సాంప్రదాయాల హరివిల్లు: అనిల్ కుమార్ యాదవ్*
నేటి సత్యం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ మసీద్ బండ గ్రామ యువకుల ఆధ్వర్యంలో భోగి మంట కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. *శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్* ముఖ్య అతిథిగా పాల్గొని భోగి జ్యోతిని వెలిగించారు. *మహేష్ బొంగురు, మహేందర్ కోడిచర్ల* బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యమానికి గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు మన సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక, సకల సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన *బల్దియా కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు*. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్, ఆజాం, గోపాల్, కల్యాణ్, శ్రీశైలం, ప్రశాంత్, ఇమ్రాన్, ఆకాష్, బ్రహ్మం యువజన, విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు