Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపేరుకే హైటెక్ సిటీ. కంపు కొడుతున్న బస్తీలు.చోద్యం చూస్తున్న అధికారులు. అధికార పార్టీ నాయకులు

పేరుకే హైటెక్ సిటీ. కంపు కొడుతున్న బస్తీలు.చోద్యం చూస్తున్న అధికారులు. అధికార పార్టీ నాయకులు

ఏరులై పారుతున్న మురికి నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్జత్ నగర్ స్థానికులు. *టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

నేటి సత్యం ఇజ్జత్ నగర్ కాలనీ ఫిబ్రవరి 4

ప్రపంచంలోనే అందమైన సుందరీకరమైన నగరంగా పేరు తెచ్చి పెట్టిన హైటెక్ సిటీ ప్రాంతం లో. ఇజ్జత్ నగర్ కాలనీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులు పాలకులు… ఆవేదన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ.

ప్రతిరోజు ఇజ్జత్ నగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యతో ఏరులై పారుతున్న నీటిలో నడుస్తున్న ప్రజలు మురికినీటి ప్రభావంతో దోమలు మలేరియా డెంగు వoట్టి అనేకమైనటువంటి రోగాలు వచ్చి రోగాల బారిన పడినటువంటి వ్యక్తులు బస్తిని కాళీ చేసి వెళ్లిపోతున్నటువంటి సందర్భం ఏర్పడింది..

హైటెక్ సిటీకి కూతబెట్టి దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ రోడ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ బాగోలేక నరకయాతన పడుతుంటే చోద్యం చూస్తున్న పాలకులు కార్పొరేటర్.ఎమ్మెల్యే.ఇలా అధికారులు. స్థానిక అధికార పార్టీ నాయకులు.

వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బస్తిబాట పట్టక తప్పదు. అంతేకాదు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగనీకే వచ్చి పార్టీ నాయకులను నిలదీయక తప్పదు అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments