Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఏ శివలింగాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుంది?

ఏ శివలింగాన్ని పూజిస్తే ఏ ఫలితం వస్తుంది?

వివిధములైనటువంటి లింగారాధనలు విశేషంగా చెప్తున్నది శాస్త్రం. అందులో శిలాలింగం మొదలుకొని రత్న లింగములు ఇత్యాదులు శాస్త్రమునందు కనపడుతున్నాయి.

ముక్తామయ లింగంతో అంటే ముత్యంతో చేసిన లింగంతో ఆరాధన చేస్తే రోగ నాశనము. ఒక ముత్యాన్ని తీసుకుని అదే శివలింగంగా భావించి ఆవాహన చేసి పూజ చేస్తే రోగ నాశనము. ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క విధమైన ఆరాధన చేయవచ్చు.

వజ్రంతో చేసిన లింగాన్ని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి జరుగుతుందని,

వైడూర్యంతో శివలింగారాధన చేస్తే శత్రునాశనము

పద్మరాగం శివలింగంగా భావించి ఆరాధన చేస్తే లక్ష్మీ ప్రాప్తి. పద్మరాగం అనగా కెంపు.

పుష్యరాగంతో చేస్తే సుఖము.

ఇంద్రనీలంతో యశము.

మరకత లింగాన్ని ఆరాధన చేస్తే పుష్టి.

స్ఫటిక లింగాన్ని సర్వాభీష్ట సిద్ధి అని చెప్తున్నారు.

రజత లింగారాధన రాజ్యాన్ని కలిగిస్తుంది. పితృ దేవతలకు సద్గతులు కలిగిస్తుంది.

సువర్ణ లింగంతో ఆరాధన చేస్తే ఉత్తమ లోకములు, ఉత్తమ స్థితి కలుగుతున్నది.

రాగి లింగ ఆరాధన చేస్తే పుష్టి, ఆయుష్షు కలుగుతున్నది.

ఇత్తడి లింగంతో ఆరాధన చేస్తే తుష్టి కలుగుతుంది.

కంచు లింగంతో ఆరాధన చేస్తే కీర్తి కలుగుతున్నది.

ధాన్యపు పిండితో లింగారాధన చేసినట్లయితే పుష్టి, తుష్టి మొదలైనవి లభిస్తాయి అని కూడా వివరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments