*జూలై 23న విద్యాసంస్థల(పాఠశాలలు, కళాశాలల) బంద్ ను విజయవంతం చేయండి*
*వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుకు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు*
*వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్*
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాపిత పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ తెలిపారు., శనివారం ఆయన అమరచింతలో మాట్లాడుతూ బంద్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటుందని, ఆయన అన్నారు. వర్కింగ్ ప ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోకడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని,దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని వారు ఆరోపించారు.అదే విధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,ఎంఇఓ, డీఈఓ, తదితర పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో అవినీతిని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల రూపాయల విద్యార్థుల ఉపకార వేతన బకాయిలను, బోధనా రుసుములను లను విడుదల చేయాలని,రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాయకులు ప్రవీణ్ ఈశ్వర్ బుజ్జి ఆకాశ సిద్ధార్థ అభిలాష నవీను చిన్నా సూరి పాల్గొన్నారు.