ప్రజా ఉద్యమాల్లో సిపిఐ అగ్రభాగాన ఉండాలి ః డాక్టర్ నారాయణ
నేటి సత్యం హైదరాబాద్ మార్చి 16
ప్రజా ఉద్యమం ఏదైనా సిపిఐ అగ్రభాగాన నిలబడాలని, అవసరమైతే ప్రజల కోసం జైళ్లకు వెళ్లేందుకు కూడ సిద్దంగా ఉండాలని సిపిఐ సెంట్రల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్.కె.నారాయణ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశనం చేశారు.హైదరాబాద్లో జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ రెండవ రోజు సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు పుట్టుకువస్తున్నాయని అందులో ఒక్కటి
శ్రీలంకలో జరిగిన ప్రజా ఉద్యమన్నారు. యువత చారిత్రాత్మక పాత్ర పోషించిన ఈ ప్రజా ఐక్య పోరాటం ఎంతటి మార్పులను తీసుకురాగలదో అక్కడ నిరూపితమైందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా లేకపోతే సమాజానికి మంచింది కాదని, అందుకే ఏ ఉద్యమమైనా సిపిఐ నాయకులు, కార్యకర్తలు దూసుకు వెళ్లాలని సూచించారు.