నేటి సత్యం హైదరాబాద్ మే 8
2026 నాటికి టోల్ రహిత భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశ రహదారులపై టోల్ ప్లాజాలను 2026 చివరి నాటికి పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకు ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ (MLFF) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈపద్ధతిలో వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా, హైవేలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్లు, కెమెరాల ద్వారా టోల్ మొత్తం ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయి.