Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగుడిసెల కూల్చివేత నిలిపివేయాలి టి రామకృష్ణ

గుడిసెల కూల్చివేత నిలిపివేయాలి టి రామకృష్ణ

నేటి సత్యం గుండ్ల సింగారం జూన్ 20

గుండ్ల సింగారంలో పేదల గుడిసెల కూల్చివేత వెంటనే నిలిపివేయాలి

టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు

గుండ్ల సింగారంలో గత ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న పేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం అత్యంత అమానుషమైన చర్య. నివాస హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అలాంటి హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు.

ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పేద ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రోడ్డున పడేయడం మానవత్వానికి విరుద్ధం. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించకపోవడం బాధాకరం. పేదలపై నిర్బంధ చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టింది.

గుండ్ల సింగారంలో జరుగుతున్న గుడిసెల కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని, అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు పునర్నిర్మాణానికి అవకాశం కల్పించాలని, శాశ్వత నివాస హక్కులు కల్పించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో పేదల తరఫున సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరిస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments