నీలం రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించిన సిపిఐ నారాయణ పళ్ళ వెంక రెడ్డి
నేటి సత్యం కొండాపూర్ డిసెంబర్ 13
స్వాతంత్ర సమరయోధులు, సి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపనలో ప్రముఖులు కీర్తిశేషులు శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి గారి 31వ వర్ధంతి సంధర్భంగా సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్, హైదరాబాద్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ లో ఘనంగా నివాళులు అర్పించారు.
సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ, జనరల్ సెక్రెటరీ పల్లా వెంకట్ రెడ్డి, Ex.MLA; శ్రీ నీలం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి గారు కమ్యూనిస్టు నిబద్దత తో ఉన్న ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అలనాటి భారత దేశ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి స్వయాన సోదరుడైనప్పటికీ వారు కమ్యూనిస్టు పార్టీ సమున్నతికినిర్విరామంగా కృషి చేశారు. ముఖ్యంగా పార్టీలో యువకులను ,మేధావులను ప్రోత్సహించారని వక్తలు రాజశేఖర రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.
నీలం రాజశేఖర్ రెడ్డి చండ్ర రాజేశ్వరరావు తో పాటు ఢిల్లీ కేంద్రంగా సి పి ఐ జాతీయ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారని, నీలం రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థులను, యువకులను, పార్టీలో వారిని ప్రోత్సహించారని తెలియజేశారు.
సి ఆర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ కన్వీనర్ కంభంపాటి అజయ్ కుమార్ వందన సమర్పణ చేశారు.
సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ శాసనమండలి సభ్యులు పి జే చంద్రశేఖర్ రావు, సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి• చెన్నకేశవరావు , మహిళా సంక్షేమ కేంద్ర సభ్యులు, జ్యోత్స్న, లలిత, ప్రజానాట్యమండలి గాయని శ్రీమతి నళిని,
సి పి ఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ, ఆశ్రమ వాసులు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ విద్యార్థినిలు, సీ ఆర్ పాలిక్లినిక్ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.