నేటి సత్యం హైదరాబాద్ జూలై 7
తెరుచుకున్న బడులు..
మొదలైన ఫుడ్ పాయిజన్లు
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
30 మంది విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు
రోజులాగే రాత్రి భోజనం చేసిన అనంతరం తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
కాగిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడడం, నాసి రకం సరుకులు వాడడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు