Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogస్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న విద్యాసంస్థలు

స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న విద్యాసంస్థలు

నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 10:

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న విద్యాసంస్థలకు ఏఐఎస్ఎఫ్ అభినందనలు

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ బంద్‌లో పాల్గొనడం అభినందనీయమని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి అధ్యక్షుడు టి. నితీష్ ధర్మ తేజ అన్నారు.

విద్య హక్కును పరిరక్షించడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం తగ్గించడం, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విశేష సహకారం అందించారని తెలిపారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఈ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి విద్యాసంస్థ యాజమాన్యానికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఏఐఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం జరిగే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే విద్యా రంగ సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని టి. నితీష్ ధర్మ తేజ డిమాండ్ చేశారు.

– టి. నితీష్ ధర్మ తేజ

ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి అధ్యక్షుడు కార్యదర్శి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments