నేటి సత్యం శంషాబాద్20
బహదూర్గూడ భూములపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ను విచారించిన హైకోర్టు, పిటిషనర్లకు సంబంధించిన భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలతో బహదూర్గూడ భూముల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం.