Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరంగారెడ్డి జిల్లాలో సిపిఐ బస్సు యాత్ర

రంగారెడ్డి జిల్లాలో సిపిఐ బస్సు యాత్ర

నేటి సత్యం/ ఆగస్టు 16

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీలను అమలు చేయాలి

*ఆగస్టు 17 నుంచి 21 వరకు సిపిఐ బస్సు యాత్ర*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రంగారెడ్డి జిల్లా డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఆగస్టు 17 నుంచి 21 వరకు సిపిఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

ఆగస్టు 17 నుండి 21 వరకు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు విస్మరించడం సరికాదన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతులు–కార్మికుల సమస్యలు తదితర ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయం, సమానత్వ విలువలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సిపిఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు గచ్చిబౌలి లో శేరిలింగంపల్లిలోకి ఎంటర్ అయ్యి అంజయ్య నగర్ కొత్తగూడా కొండాపూర్ లో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ సభను శేర్లింగంపల్లి బడుగు బలహీన వర్గాలు సిపిఐ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా..

ఆగస్టు 18ఉదయం గచ్చిబౌలి నుండి వేరే మండలంలోకి బస్సు యాత్ర వెళుతుంది…

సిపిఐ చేపట్టే బస్సు యాత్రలో ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments