నేటి సత్యం /శంషాబాద్ /ఆగస్టు 28
శంషాబాద్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రిక విడుదల*
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సెప్టెంబర్ 6.7.8 తేదీలలో కరీంనగర్ పట్టణంలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటియుసి మహాసభల వాల్ పోస్టర్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా *భవన నిర్మాణ అదర్ కన్స్ట్రక్షన్ సంగం రాష్ట్ర నాయకులు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నర్రగిరి పాల్గొన్నారు*.
శంషాబాద్ మండల ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గిలక రాజు, మండల అధ్యక్షులు శ్రీను, భావన నిర్మాణ ఆధర్ కన్స్ట్రక్షన్ సంగం మండల అధ్యక్షుడు ఎద్దుల శ్రీను, మండల ఉపాధ్యక్షులు దండు రవి మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్ర గిరి మాట్లాడుతూ కరీంనగర్లో జరిగే రాష్ట్ర నాలుగో మహాసభలకు శంషాబాద్ మండల కేంద్రం నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది.