నేటి సత్యం న్యూఢిల్లీ మే 22
లోన్ రికవరీ అంశంలో ఎందుకీ వివక్ష?
కోట్లల్లో కార్పొరేట్ లోన్లు తీసుకున్న వారిని వదిలేస్తారు..తక్కువ లోన్ తీసుకున్న వారిని వేధిస్తారు అంటూ బ్యాంకు సిబ్బందిపై సుప్రీం కోర్టు అసహనం
గొప్పోడికి మాత్రం వెనుకా ముందు చూసుకోకుండా లోన్లు ఇచ్చేస్తారు, సామాన్య ప్రజలకు ఎన్నో నిబంధనలు పెడతారు అంటూ వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి
కొన్ని సార్లు లోన్ రికవరీ చేసే క్రమంలో బ్యాంకు సిబ్బంది సామాన్య ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నారని, కానీ కార్పొరేట్ కంపెనీలను మాత్రం సులువుగా వదిలేస్తున్నారని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి
ఎస్బీఐ నుండి రుణం తీసుకుని చెల్లించే పరిస్థితి లేదని, సమయం ఇవ్వాలని కోరినా ఆస్తులు జప్తు చేస్తున్నారని, బ్యాంకు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఓ ప్రైవేట్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు