పిడుగుపాటు కు పోలీస్ కానిస్టేబుల్ మృతి..
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, జూన్ 5, నేటి సత్యం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ బందో బస్తు కు విధి నిర్వహణకు వెళ్లి తిరిగి వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై పిడుగు పడి అకాల మృతిచెందిన సంఘటన ఒకటి మావిళ్ళపల్లి గ్రామ సమీపం లో శుక్రవారం సాయంత్రం జరిగినది.
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామ సమీపం లో శుక్రవారం మధ్యాహ్నం పడిన అకాల వర్షం లో పడిన పిడుగు పాటుకు గురై కానిస్టేబుల్ ఉల్పర వాసి రాజు(45) మృతి చెందారు .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.