Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogమొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 5

మొక్కలు నాటాలి  పర్యావరణాన్ని కాపాడుకోవాలి

*ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపు*

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.

నేడు విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలు, పరిశ్రమల కాలుష్యం కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షాలు, నీటి కొరత, వాతావరణ మార్పులు మానవాళికి పెద్ద ప్రమాదంగా మారాయని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసే విధానాలను విరమించి, హరిత పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చెట్లను నరికివేసే వారికి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు.

ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటి దానిని పెంచితేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, తాగునీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని టి. రామకృష్ణ పేర్కొన్నారు.

“మొక్కలు నాటుదాం… ప్రకృతిని కాపాడుదాం… భావితరాలకు భద్రమైన భవిష్యత్తును అందిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.

– టి. రామకృష్ణ

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments