నేటి సత్యం జూలై16
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య.
గుడికని బయటకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి హత్య.. అనంతరం భర్త బైక్ పైనే నిందితులతో కలిసి భార్య పరార్
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో ఘటన
హోసూర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్కి.. కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల కిందట వివాహం కాగా వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ సంతానం
అయితే బైక్ పై సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికని బయల్దేరిన కుటుంబం
రాత్రయినా ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హాసిని తల్లి
పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా మొదట భర్త, పాపతో హాసిని బైక్ పైన ఆలయానికి వెళ్లినట్లు కనిపించగా.. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్ పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తింపు
అయితే ఉద్దేశపూర్వకంగా పర్స్ పడేసి, కొంత దూరం వెళ్లాక తన పర్స్ పడిపోయిందని రమేష్కు చెప్పిన హాసిని
పర్స్ కోసం రమేష్ వెళ్లగా.. అక్కడ ఆల్రెడీ కాపుకాస్తున్న ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు కలిసి దాడి
రమేష్ను చంపి, డెడ్ బాడీని వదిలేసి.. రమేష్ బైక్పైనే మరో ఇద్దరితో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్లిన హాసిని
సాక్ష్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభ్యం
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఆధారంగా భార్యే భర్త రమేశ్ను చంపినట్లు తేల్చిన పోలీసులు